ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం .ఇప్పటికే అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి చేరుతున్న విషయం తెల్సిందే .తాజాగా గత యూపీఏ హయంలో కేంద్ర మంత్రిగా పని చేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి తనయుడు అయిన మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి త్వరలోనే వైసీపీ గూటికి వస్తోన్నారు అని వార్తలు జిల్లా రాజకీయాల్లో హాల్ చల్ చేస్తోన్నాయి .
కర్నూలు జిల్లాలో అతి శక్తివంతమైన దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరిన తర్వాత అదే పార్టీ నుండి వైసీపీలో చేరిన మాజీ సీనియర్ మంత్రి శిల్పా చంద్రమోహన్ రెడ్డి ,అతని సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి చేరికతో బలంగా కనిపిస్తున్న ప్రస్తుత తరుణంలో జిల్లాలో మంచి పట్టున్న మాజీ కేంద్ర మంత్రి కోట్ల కూడా వైసీపీలో చేరితే జిల్లాలో వైసీపీకి తిరుగుండదు అని ఆలోచనతో కోట్లను చేర్చుకోవడానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం .
మూడున్నరేండ్ల కిందట జరిగిన రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పని ఖతం కావడంతో కోట్ల మూడున్నరేళ్లుగా క్రియాశీల రాజకీయాల్లో పెద్దగా కనిపించకపోయినా.. కర్నూలు జిల్లాలో ఆయన వర్గానికి ఇప్పటికీ మంచి పట్టు ఉంది.గత కొన్నాళ్లుగా కోట్ల కుటుంబం కాంగ్రెస్ను వీడి వైసీపీలో చేరుతాయన్న వార్తలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి.. ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కు, కోట్ల సూర్య ప్రకాష్ ఫ్యామిలీకి మధ్య మంచి అనుబంధం ఉంది..ఈ నేపథ్యంలో కోట్ల సూర్యప్రకాష్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.త్వరలోనే ఆయన వైసీపీ గూటికి రావడం ఖాయం అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి .