నేటి రాజకీయాల్లో ముఖ్యంగా అధికారం కోసం ఎవర్ని ఎప్పుడు ఏ విధంగా ఎలా వాడుకోవాలో ఏపీ సీఎం ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు తెల్సినట్లుగా ఎవరికీ తెలియదు అని రాజకీయ విశ్లేషకుల టాక్ .రాజకీయ విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూనే చంద్రబాబు తన రాజకీయ జీవితాన్ని బిల్డ్ చేశారు .
ప్రస్తుతం చేస్తోన్నారు .అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో నందమూరి కుటుంబానికి చెందిన ప్రస్తుత టాలీవుడ్ స్టార్ యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుండి నేటి ఆ పార్టీ సీనియర్ నాయకులైన మోదుగుల వేణుగోపాల రెడ్డి దగ్గర నుండి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి వరకు అందర్నీ తన రాజకీయ చదరంగంలో పావులుగా వాడుకొన్నాడు అని రాజకీయ వర్గాల్లో టాక్ .
అయితే తాజాగా ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో భాగంగా మంత్రి పదవులను కోల్పోయిన మాజీ మంత్రులు రావెల కిషోర్ బాబు ,బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి ,పీతల సుజాత ,కిమిడి మృణాళిని లకు వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇవ్వను అని చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ముళ్ళకు తేల్చి చెప్పినట్లు వార్తలు వస్తోన్నాయి .