తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారాన్ని చేపట్టిన టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలోని ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై నల్గొండ లోక్ సభ నియోజక వర్గంలో మంచి మార్కులే వచ్చాయి .గత మూడున్నర యేండ్ల కేసీఆర్ పాలనపై సర్వే నిర్వహించగా 45 .45 %మంది బాగుంది అన్నారు .28 .18 శాతం మంది బాగాలేదు అని అన్నారు .అయితే ఇటీవల మోదీ పాలనపై కూడా నిర్వహించిన సర్వేలో వచ్చిన సర్వే ఫలితాలతో పోల్చుకుంటే కేసీఆర్ పాలనకు ఎక్కువమంది జై కొట్టారు అని తేలింది .
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మూడున్నరెండ్లలో పరిపాలన ,ప్రభుత్వ పథకాలు ,నిరుద్యోగ సమస్య లాంటి విషయాల మీద ఫ్లాష్ టీం సర్వే చేయగా టీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ పాలనలోనే నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది ప్రజలు ,నిరుద్యోగ యువత తమ అభిప్రాయాలను స్పష్టం చేయడం గమనార్హం .నిరుద్యోగ సమస్య గత ప్రభుత్వం హయంలో ఎక్కువగా ఉంది అని 54.01శాతం మంది చెబితే టీఆర్ఎస్ పాలనలోనే ఎక్కువగా ఉంది అని 45.59 శాతం మంది తెలిపారు .ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది అని అత్యధికంగా మిర్యాలగూడ నియోజక వర్గంలో 53.18శాతం స్పష్టం చేశారు .
ఈ సమస్య గత ప్రభుత్వం హయంలోనే ఎక్కువగా ఉందని కోదాడ నియోజక వర్గంలో అత్యధికంగా 60 .10 శాతం ,సూర్యాపేట నియోజక వర్గంలో 59 .95 శాతం మంది చెప్పారు .ఇక శాంతి భద్రతల విషయంలో టీఆర్ఎస్ పాలనలోనే మెరుగ్గా ఉన్నాయని అభిప్రాయాలు ఈ సర్వేలో తేలింది .శాంతి భద్రతల సమస్య ఎక్కువగా కేసీఆర్ పాలనలో ఉంది అని నల్గొండ నియోజక వర్గంలో అత్యధికంగా 54 .42 శాతం మంది అభిప్రాయపడ్డారు .నాగార్జున సాగర్ నియోజక వర్గంలో 53.46శాతం మంది ,మిర్యాలగూడ ,దేవరకొండ నియోజక వర్గాలలో వరసగా 53 .30 శాతం మంది ,49 .17 శాతం మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు .కానీ ఈ సమస్య మాత్రం గత ప్రభుత్వాల్లోనే అత్యదికమని కోదాడ ,సూర్యాపేట ,హుజూర్ నగర్ ,దేవరకొండ నియోజక వర్గాల్లో వరసగా 62 .05 %, 56 . 67 %, 56 .13 %, 50 .8౩ %మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు .