బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ అర్ధరాత్రి ఫుల్ గా త్రాగి ఒక ప్రముఖ స్టార్ హీరో ఇంటికి వెళ్ళింది అంట .ఈ విషయం గురించి ఆ స్టార్ హీరోనే చెప్పారు .ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేస్తోన్న స్టార్ హీరో హృతిక్ రోషన్, కంగనా రనౌత్ వివాదం మరింత రాజుకుంది .ఈ క్రమంలో హీరోయిన్ కంగన తనపై చేస్తున్న ఆరోపణల్ని ఖండిస్తూ ఆయన తొలిసారి ప్రముఖ యాంకర్ అర్నబ్ గోస్వామి చేసిన ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడారు.
ఆయన మాట్లాడుతూ కంగన గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు.ఆయన మాట్లాడుతూ ‘తొలిసారి ఆమెని(కంగనను) 2008లో కలిశాను. అప్పుడు కూడా ఆమెతో స్నేహం చేయలేదు. నేను నటించిన ‘మనాలి’ చిత్రంలో నా పాత్ర బాగా నచ్చిందని చెప్పింది. నాక్కూడా ఆమె పనితనం నచ్చింది. ‘క్రిష్3’ చిత్రంలో ఆమె నటన చాలా బాగుంది. ఆమెని చూసి గర్వపడ్డాను కూడా.ఈ విషయం తనకి చాలా సార్లు చెప్పాను.’
‘ఒక సారి సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా జోర్డాన్లో పార్టీ చేసుకున్నాం. నేను చాలా అలసిపోయాను. నా రూంలోకి వెళ్లిపోయాను. అప్పుడు ఆమె నా వద్దకు వచ్చి మాట్లాడాలి అంది. ఇప్పుడు కాదు ఉదయం మాట్లాడుకుందాం అని చెప్పి నా రూంలోకి వెళ్లిపోయాను. ఆ తర్వాత ఎవరో నా రూం తలుపును గట్టిగా కొడుతూనే ఉన్నారు. ఎవరా అని తలుపు తీసి చూస్తే వికృత పరిస్థితుల్లో ఆమె కన్పించింది. ఆమె తాగి ఉంది. ఏం చేయాలో తెలీక నా మేనేజర్ని పిలిచాను. నా మేనేజర్ ఆమె సోదరి రంగోలీకి సమాచారం అందించడంతో ఆమెను తన రూంలోకి తీసుకెళ్లింది. ఆమె ప్రవర్తనను చూసి తప్పుగా అర్థం చేసుకోవద్దు అని చెప్పి తన సోదరిని వెళ్లిపోయింది.’ అని చెప్పుకొచ్చాడు హృతిక్.