Home / SLIDER / కార్మికులకు రూ.10 లక్షలు వడ్డీలేని రుణం ..సీఎం కేసీఆర్

కార్మికులకు రూ.10 లక్షలు వడ్డీలేని రుణం ..సీఎం కేసీఆర్

కార్మికుల ఇంటి నిర్మాణంకోసం 10లక్షలు వడ్డీలేని రుణాలిస్తామని   సీఎం కేసీఆర్ అన్నారు. ఈ రోజు  ప్రగతిభవన్‌లో సింగరేణి కార్మికులతో సీఎం కేసీఆర్ ఆత్మీయసమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..టీబీజీకేఎస్ గెలించింది 2012లో..ఆ తర్వాతనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిందని సీఎం కేసీఆర్ తెలిపారు. సింగరేణి గురించి ప్రజాప్రతినిధులతో గంటర్నరకుపైగా మాట్లాడినట్లు చెప్పారు. గతంలో కూడా టీబీజీకేఎస్‌ను గెలిపించారు. ఈ సారి గెలుపు సింగరేణి కార్మికుల గెలుపు కావాలన్నారు.కార్మికులు గెలిచినపుడే నిజమైన గెలుపని సీఎం కేసీఆర్ అన్నారు. సింగరేణి కార్మికులకు మంచి జరగాలని సీఎం  కేసీఆర్ ఆకాంక్షించారు. సింగరేణి లాభం రూ.750 నుంచి 800 కోట్లు వచ్చినయి. కొత్త పే రివిజన్ ప్రకారం పెరిగిన వేతనాలు ఇవ్వడానికి రూ.375 కోట్లు పక్కనబెట్టినట్లు సీఎం వెల్లడించారు.

టీబీజీకేఎస్ గుర్తింపు సంఘానికి సభ్యత్వ రుసుము ఇక నుంచి ఒక్కరూపాయే ఇవ్వాలని సీఎం సూచించారు. క్వార్టర్ మారినా లంచం ఇవ్వాలి. జ్వరం వచ్చినా లంచం ఇవ్వాలి. కార్మికులు ఎందుకు లంచం ఇయ్యాలే..అని సీఎం ప్రశ్నించారు. రేపటి నుంచి లంచం అడిగినోన్ని..తీసుకున్నోన్ని చెప్పుతో కొట్టాలని సీఎం నిర్దేశించారు. సింగరేణి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే వాటా నుంచి రూ.50 కోట్లు తగ్గించుకోనైనా, రూ.10 లక్షల రుణం ఇస్తమని సీఎం పునరుద్ఘాటించారు. కార్మికుల తల్లిదండ్రులకు కూడా రిఫరల్ హాస్పిటల్ కల్పిస్తమన్నారు. సింగరేణిలో పరిస్థితులను చక్కదిద్దాలన్నారు. సింగరేణి ఉద్యోగం అనుకున్నంత మంచిదికాదు. సింగరేణి కార్మికులు ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తరన్నారు. బయ్యారం ఉక్కుగనిని కూడా సింగరేణికే అప్పగిస్తమని సీఎం స్పష్టం చేశారు. ఓపెన్‌కాస్ట్ గనుల్లో సీనియర్లకు అవకాశం కల్పిస్తమన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat