Home / ANDHRAPRADESH / మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి బాబు షాక్ ..

మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి బాబు షాక్ ..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలను ,ఇద్దరు ఎంపీలను అధికార పార్టీ తెలుగుదేశంలోకి పదవులు ఆశ చూపించి చేర్చుకున్న సంగతి విదితమే .ఆ తర్వాత మొదట ఇచ్చిన మాట ప్రకారం ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో భాగంగా అప్పటివరకు రాష్ట్ర ఐటీ, సమాచార శాఖ మంత్రిగా ఉన్న పల్లె రఘునాథ రెడ్డిను తప్పించిన సంగతి తెల్సిందే .

అయితే తాజాగా ఆయన ఎమ్మెల్యే సీటుకే ఎసరు వచ్చింది .ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పుట్టపర్తి అసెంబ్లీ నియోజక వర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తోన్న పల్లె రఘునాథ రెడ్డి స్థానంపై అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ హిందూపురం లోక్ సభ సభ్యుడు నిమ్మల కిష్టప్ప కన్ను వేశాడు .వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తన వారసుడు అయిన అంబరీష్ను ను బరిలోకి దింపాలని భావిస్తున్నాడు .దీనిలో భాగంగా ప్రస్తుతం పల్లె ప్రాతినిధ్యం వహిస్తోన్న పుట్టపర్తిను ఎంపిక చేసుకున్నాడు సదరు ఎంపీ .

అయితే ఒక పక్క వచ్చే ఎన్నికల్లో మొత్తం డెబ్బై మంది కొత్త వారికి అవకాశం ఇస్తాను ఇప్పటికే పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించాడు .దీనికి తగ్గట్లు కిష్టప్ప బాబు దగ్గర లాబియింగ్ జరుపుతున్నాడు .ఎట్లాగు వచ్చే ఎన్నికల్లో కొత్తతరానికి అవకాశం ఇవ్వాలని చూస్తోన్న బాబుకు కిష్టప్ప చెప్పిన తీరు నచ్చడంతో వచ్చే ఎన్నికల్లో పుట్టపర్తి అసెంబ్లీ నియోజక వర్గం నుండి కిష్టప్ప తనయుడు అంబరీష్ను బరిలోకి దించుతాం ..అందుకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేసుకోమని బాబు చెప్పినట్లుగా కిష్టప్ప వర్గీయులు అప్పుడే జిల్లాలో ఇటు అసెంబ్లీ నియోజక వర్గంలో ప్రచారం మొదలెట్టారు .దీంతో ఇప్పటికే మంత్రి పదవి నుండి తప్పించి షాకిచ్చిన బాబు పల్లె రఘునాథ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న అసెంబ్లీ నియోజక వర్గ స్థానాన్ని కిష్టప్ప చేతిలో పెట్టి అంతకంటే బిగ్ షాకిచ్చాడు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat