ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతోనే అధికారం కోల్పోయారు .కానీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల మద్దతుతో గెలవాలని ..గెలిచి రాజన్న రాజ్యాన్ని తీసుకురావాలని అహర్నిశలు కష్టపడుతున్నాడు .ఈ క్రమంలో అందుకు తగ్గట్లు బలమైన అభ్యర్ధులను సిద్ధం చేస్తోన్నాడు వైఎస్ జగన్ .
దీనిలో భాగంగా రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు అసెంబ్లీ నియోజక వర్గానికి అభ్యర్ధిని ఖరారు చేశాడు అని వార్తలు వస్తోన్నాయి .అందులో భాగంగా దివంగత పిడతల రంగారెడ్డి కోడలు, మాజీ శాసనసభ్యురాలు పిడతల సాయికల్పనారెడ్డిను గిద్దలూరు నుంచి పోటీకి దించాలని ఆయన నిర్ణయించారు అని వైసీపీ శ్రేణులు అంటున్నారు .అంతే కాకుండా వచ్చే ఎన్నికల సమయంలో అవసరమైన ప్రజల మద్దతును సమకూర్చుకోగలనని, ఉమ్మడి కుటుంబపరంగా అందరం సమావేశమై తీసుకున్న నిర్ణయం మేరకు తాను ముందుకు వచ్చానని, అవకాశం కల్పించాలని పార్టీ అధినేత జగన్ను, ఇతర నాయకులను ఆమె కోరినట్లు తెలిసింది.
కొద్దిరోజుల క్రితం ఆమె జిల్లా అధ్యక్షుడు బాలినేనిని కలిసి తర్వాత అధినేత జగన్తోనూ భేటీ అయినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం గిద్దలూరుతోపాటు, మరికొన్ని నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలు ఉన్నప్పటికీ వారికంటే బలమైన వారు ముందుకు వస్తే వారిని రం గంలోకి దింపి ప్రస్తుతం ఉన్న వారికి ప్రత్యామ్నా య అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతో వైసీపీ అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ కోణంలోనే సాయి కల్పనారెడ్డి వైపు మొగ్గు చూపి లాభనష్టాలపై బేరీజు వేయాలని బాలినేనిని ఆదేశించినట్లు తెలిసింది.కాలమే చెప్పాలి ఈ వార్తలో ఎంత నిజం ఉందో ..?