టాలీవుడ్ క్యూట్ లవర్స్ చైతు, సమంతలు వివాహం గోవాలో అంగరంగ వైభవంగా జరిగిపోయింది. సమంత, నాగచైతన్యల వివాహం అతి తక్కువమంది బంధువులతో ఎంతో గ్రాండ్గా వివాహం జరిగింది. తొలుత హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగితే ఆ తర్వాత క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. ఇక హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగే సమయంలో మాత్రం సమంత బోరున విలపించారు. కన్యాదానం జరిగే సమయంలో సమంత కంట కన్నీరు వచ్చింది.
అంతకుముందు వరకు ఎంతో చలాకీగా ఫోటోలు తీసుకుంటూ నవ్వుతూ గడిపిన సమంత తాను మరొకరికి ఇంటికి వెళ్ళిపోతున్నానని తెలియడంతో కంట కన్నీరు ఆగలేదు. పక్కనే ఉన్న అమల, నాగార్జునలు ఏడవద్దమ్మా.. మేమున్నాముగా అంటూ గట్టిగా హత్తుకున్నారట. నీకు అండగా మేమున్నాం.. బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు మా అమ్మవు అంటూ నాగార్జున, అమలలు చెప్పడంతో సమంతకు మళ్ళీ కన్నీళ్ళు ఆగలేదు. దాంతో నాగార్జున నిన్ను మా కంటి రెప్పలా చూసుకుంటామని సమంతకి మాట ఇచ్చారట..మామ నాగార్జున.