ప్రస్తుతం పండగ వచ్చిన ..పబ్బం వచ్చిన ..బాధ వచ్చిన నలుగురు దోస్తులతో కల్సి పంచుకోవడానికి కావలసింది మందు .ఎంతగా అంటే సాయంత్రం డ్యూటీ అయిపోతే చాలు పాత దోస్తులు కలిస్తే వాళ్లతో ..లేదా ఇంటికి వెళ్లి ..లేదా బార్ షాప్ ల ఆ రోజు చేసిన శ్రమను మరిచిపోవడానికి లేదా ఆ రోజు సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక పెగ్ త్రాగుంటారు .కానీ అలాంటి వాళ్ళకు బ్యాడ్ న్యూస్ .
అయితే అది ఇక్కడ కాదు .పక్కన నున్న తమిళనాడు రాష్ట్రంలో .ఇటీవల రాష్ట్రంలో ఉన్న సర్కారు ఉద్యోగులకు తీపీ కబురును అందించిన రాష్ట్ర ప్రభుత్వం మందు బాబులకు మాత్రం చేదు కబురును అందించింది .అందులో భాగంగా మద్యం ధర పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది .
నిన్న బుధవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు .అందులో భాగంగా బీరు ,బ్రాందీ ,విస్కీ లపై రూ 12 .,రూ 10ల చొప్పున పెంచాలని సర్కారు నిర్ణయం తీసుకుంది .దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాది ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం అదనంగా వస్తుంది .