ఏపీ లో విచిత్ర పరిస్థితి నెలకొన్నది .ఒకవైపు గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నికల హామీలలో ఒక్క హామీ నేరవేర్చకపోగా వాటిపై ..ప్రజల సమస్యల పై పోరాడుతున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీను బలహీన పరిచే ప్రయత్నాలు చేస్తుంది అధికార తెలుగుదేశం పార్టీ .అందులో భాగంగా వైసీపీ పార్టీకి చెందిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను ..ఇద్దరు ఎంపీలను టీడీపీ వైపు లాక్కున్నాడు ముఖ్యమంత్రి ,టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు .
అయితే తాజాగా మరో ఎంపీ పై బాబు కన్ను పడింది వార్తలు వస్తోన్నాయి .అందులో భాగంగా రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు చెందిన ఎంపీ బుట్టా రేణుక ను తమ పార్టీలోకి లాక్కోవడానికి పావులు కదుపుతున్నారు అని వార్తలు వస్తోన్నాయి .అందుకు ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి నిలవడానికి అయ్యే ఖర్చులతో పాటుగా సుమారు డెబ్బై నుండి ఎనబై కోట్ల రూపాయలు ప్రస్తుతానికి ఇవ్వడానికి తను సిద్ధంగా ఉన్నాను అని బాబు తేల్చి చెప్పినట్లు జిల్లా రాజకీయాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి .
అందులో భాగంగా రేణుక నిన్న బాబుతో విజయవాడ లో సమావేశం అయ్యారు అని కూడా టాక్ .అయితే ప్రస్తుతం ఆమెకు ప్రజల్లో ఆదరణ లేకపోవడం ..గత ఎన్నికల్లో జగన్ ను చూసి ఆమెను గెలిపించడం అందరికి విదితమే .అయితే తను ప్రస్తుతం వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పడం వలన ఇటు వైసీపీ పార్టీకి నష్టం కంటే లాభం ఎక్కువ అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి .ఎందుకంటే వైసీపీలోకి ఇటు కర్నూలు జిల్లాతో పాటుగా సీమలో మరో రెండు జిల్లాలో ప్రభావం చూపగల మాజీ సీనియర్ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం వైసీపీలోకి చేరబోతున్నారు అని సమాచారం .సో బుట్టా వెళ్ళిన కానీ కోట్ల వలన ఆ లోటును వైసీపీ భర్తీ చేసుకోగలుగుతుంది అని రాజకీయ వర్గాలు అంటున్నారు .