Home / NATIONAL / పోలీసులు చేసిన ఓ పని సోషల్ మీడియాలో వైరల్

పోలీసులు చేసిన ఓ పని సోషల్ మీడియాలో వైరల్

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ వ్యవస్థ ప్రచారం మాటమేగానీ.. దానిని నిరూపించేందుకు ఆ శాఖ చెయ్యని ప్రయత్నాలు లేవు. సోషల్ మీడియా వేదికగా వాళ్లు చేసే యత్నాలను స్టంట్లుగా అభివర్ణించేవారు కొందరైతే.. అభినందించేవారు లేకపోలేదు. తాజాగా ముంబై పోలీసులు చేసిన ఓ పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అనిశ్‌ అనే ఓ వ్యక్తి ఓ కేసుకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు శనివారం, సకినక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడు. ఫిర్యాదు చేసే సమయంలో తన పూర్తి వివరాలను అందించగా.. అందులో అతని పుట్టిన అదే రోజని రాశాడు. ఇది గమనించిన రైటర్‌ ఆ సమాచారాన్ని ఉన్నతాధికారికి అందజేశాడు. అంతే ఆ కేసు ప్రాథమిక విచారణ నివేదిక(ఎఫ్‌ఐఆర్‌)ను ఓవైపు సిద్ధం చేసి.. కేక్‌తోపాటు ఆ కాపీని అతని చేతిలో పెట్టారు.

ఊహించని ఆ పరిణామానికి అనీశ్ ఉబ్బి తబ్బిబి అయ్యాడు. ఆ యువకుడికి కేక్‌ తినిపిస్తున్న ఫోటోలను ముంబై పోలీస్‌ శాఖ తమ అఫీషియల్‌ ట్విట్టర్‌లో పోస్టు చేయగా.. పోలీసులది వెన్నెలాంటి మనసు అని పలువురు కామెంట్లు పెడుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat