భారతీయ టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన అంబానీ కి చెందిన జియో నుంచి వస్తున్న తరుణంలో ఆ పోటిని తట్టుకోవడానికి ఎయిర్ టెల్ సరికొత్త నిర్ణయం తీసుకుంది .ఈ క్రమంలో ప్రస్తుతం టెక్నాలజీ రంగాన్ని శాసిస్తున్న ప్రముఖ మొబైల్ ఐ ఫోన్ విషయంలో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది .అదే అతి తక్కువ డౌన్పేమెంట్కే ప్రీమియం స్మార్ట్ఫోన్లను అందించే ఉద్దేశంతో ఆన్లైన్ స్టోర్ను ప్రారంభించింది.
ఈ క్రమంలో యాపిల్ ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ మోడళ్లను తమ ఎయిర్టెల్ ఆన్లైన్ స్టోర్ ద్వారా అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. దీని ద్వారా 32 జీబీ ఐఫోన్ 7 మోడల్ను రూ.7,777 డౌన్పేమెంట్ కింద వినియోగదారులకు అందిస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని నెలకు రూ.2,499 చొప్పున 24 నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది. నెలకు 30 జీబీ డేటా, అపరిమిత లోకల్/ఎస్టీడీ కాల్స్తో పాటు, ఎయిర్టెల్ సెక్యూర్ ప్యాకేజీని కంపెనీ అందిస్తోంది. ఇవన్నీ నెలవారీ చెల్లింపులో భాగంగా ఉంటాయి.