ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఫైర్ అయ్యారు .ఈసారి ఏకంగా మంత్రి నారాయణ మీద .అసలు విషయానికి వస్తే అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో మంత్రి నారాయణకు పలు చైతన్య ,నారాయణ కళాశాలలు ఉన్న సంగతి తెల్సిందే .అయితే గత కొద్ది రోజులుగా మంత్రి నారాయణకు చెందిన కళాశాలలో పలువురు విద్యార్ధిని విద్యార్ధులు పారిపోవడం కానీ ఆత్మహత్యలు చేసుకోవడం కానీ మనం వార్తల్లో చూస్తున్నాం .
ఈ క్రమంలో కళాశాల యాజమాన్యాలతో ముఖ్యమంత్రి సమావేశం ఏర్పాటు చేశారు .ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ విద్య పేరిట కళాశాలలో విద్యార్థులను రోబోలుగా మార్చే కార్పోరేట్ విద్యా విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయా సంస్థల యాజమాన్యాన్ని హెచ్చరించారు.ప్రైవేటు కళాశాలకు స్వీయ నియంత్రణ ఉండాలని, విద్యార్థులను వేధించే పద్ధతులను తక్షణం వదిలిపెట్టాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన కళాశాలలపై కఠినచర్యలు తీసుకుంటామని బాబు హెచ్చరించారు.