టాలీవుడ్ స్టార్ హీరో యువరత్న నందమూరి బాలకృష్ణ మరోసారి వార్తల్లోకి ఎక్కారు .ఈసారి అలాంటి ఇలాంటి వార్తతో కాదు ఏకంగా స్టేజీ మీద ఫైట్ చేసిన సంఘటనతో .అసలు విషయానికి వస్తే బాలయ్య బాలకృష్ణ ఒక స్టేజీ మీద కొందరు ఫైటర్లతో ఫైట్ చేశాడు.
తమిళనాడు రాష్ట్ర రాజధాని మహానగరం చెన్నైలో జరిగిన స్టంట్ ఆర్టిస్ట్స్ యూనియన్ 50వ వార్షికోత్సవం ఈ మరపురాని దృశ్యానికి వేదికైంది. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన బాలకృష్ణ స్టేజీ మీదకు రాగానే స్టేజీ మీద ఓ స్టంట్ చేసి చూపిస్తారా అని హోస్ట్ అడిగారు. దాని సరే అన్న బాలయ్య… ఒక నలుగురు స్టంట్ అసిస్టెంట్లతో ఒక స్టంట్ చేశారు. ఆఖరులో తనదైన శైలిలో తొడగొట్టి అదరగొట్టారు.