తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ నియోజక వర్గంలో అడ్డగుట్ట డివిజన్ లోని బోయబస్తీలో 33 లక్షలతో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ పనులను మంత్రి పద్మారావు పర్యవేక్షించారు..పనులు త్వరితగతంగా జరగాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.. అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దని..సమస్యలను అధిగమించి త్వరితగతంగా పనులుపూర్తిచేయాలని మంత్రి అన్నారు..
హైటెన్షన్ వైర్లు కమిటీ హాల్ కు అడ్డురావడంతో వాటిని తొలిగించి పనులల్లో వేగవంతం చేయాలనీ మంత్రి అధికారులకు సూచించారు.. బోయబస్తీ ప్రాంత ప్రజలతో మంత్రి సుమారు 2 గంటలపాటు ముఖాముఖీ మాట్లాడి సమస్యలను అడిగితెలుసుకొని పరిష్కరించారు..ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విజయకుమారి వాటర్ వర్క్స్ GM సుదర్శన్, DGM సునీల్, EE ఇంద్రాభాయ్, DEE పరమేశ్వర్, AE ప్రశాంతి, ట్రాన్స్కో DE రాజేందర్ తెరాస సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..