టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్రపై వస్తోన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ గురించి ప్రస్తుత టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు .ఆయన ఈ మూవీ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ జీవిత చరిత్ర గురించిన వాస్తవాలకు విరుద్ధంగా ఎవరు సినిమా తీసినా ప్రజలు ఆమోదించరని ఆయన అన్నారు.
ఈ రోజు రాష్ట్రంలో రాజధాని అమరావతిలోని తన నివాసంలో పార్టీ సమన్వయ కమిటీ సభ్యులతో ఆయన సమావేశం సందర్భంగా మాట్లాడుతూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో రామ్గోపాల్వర్మ సినిమా తెరకెక్కిస్తున్న విషయం గురించి ప్రస్తావిస్తూ ఎన్టీఆర్ ఎవరో, ఆయన జీవితంలో జరిగిన పరిణామాలేమిటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని…
సినిమాపై తమ పార్టీ నేతలెవరూ ఇష్టానుసారంగా మాట్లాడొద్దని సూచించారు. వాస్తవంగా జరిగిన ఘటనలకు విరుద్ధంగా చరిత్రను వక్రీకరించి ఎవరు సినిమా తీసినా ప్రజలు హర్షించరని ఆయన అన్నారు. ప్రజామోదం లేని సినిమాల పట్ల అంతగా ఆవేశపడాల్సిన అవసరం లేదని బాబు అన్నారు .