Home / SLIDER / మంత్రి కేటీఆర్ కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం..

మంత్రి కేటీఆర్ కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం..

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి. రామారావుకు మరొక ప్రతిష్టాత్మకమైన ఆహ్వానం అందింది. అబుదాబి భారత రాయబార కార్యాలయం, దుబాయ్ మరియు యూఏఈ లోని ప్రముఖ పారిశ్రామిక సంఘం బిజినెస్ లీడర్స్ ఫోరమ్ నిర్వహించనున్న ఇండియా-యూఏఈ భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానం లభించింది. ఈ సమావేశంలో భారతదేశంతోపాటు గల్ఫ్ లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అధికారులు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు సుమారు ఎనిమిది వందల మందికిపైగా పాల్గొననున్నారు.

దుబాయ్, యూఏఈ దేశాలతో భారత దేశ వాణిజ్య వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈ నెల 30,31 తేదిల్లో ఈ సమావేశం దుబాయ్ లో జరగనున్నది. 30న జరిగే మంత్రుల స్ధాయి సెషన్లో పాల్గొనాల్సిందిగా మంత్రి కె.టి. రామారావును నిర్వాహకులు కోరారు.

ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఉండాల్సిన వ్యూహాత్మక వ్యాపార భాగస్వామ్యం, పెట్టుబడులు, పాలసీలు, టూరిజం వంటి అంశాలపైన మాట్లాడాల్సిందిగా కోరారు. దీంతోపాటు తెలంగాణలోని ఉన్న పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ పారిశ్రామిక పాలసీలపైన ప్రసంగించాలని కోరారు.
ఇప్పటికే ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా బిజినెస్ లీడర్స్ ఫోరమ్ మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం పంపింది

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat