దేశ వ్యాప్తంగా ఈ రోజు ప్రజలు దీపావళి పండుగను ఎంతో ఉత్సాహంగా సంతోషంగా కొత్త దుస్తులను ధరించి జరుపుకుంటున్నారు . తమ దోస్తులకు ..శ్రేయోభిలాషులకు ఫోన్ల ద్వారా ..ఫేస్ బుక్ ద్వారా ..వాట్సప్ ద్వారా మేసేంజర్స్ ద్వారా ఇలా పలు విధాలుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తోన్నారు .ఈ నేపథ్యంలో ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు తన అభిమానులకు ,జనసేన శ్రేణులకు ,ప్రజలకు పండుగ పర్వదిన శుభాకాంక్షలు చెప్పారు .
అది కూడా తమ పార్టీ కార్యాలయం నుండి ఒక మీడియా ప్రకటనను విడుదల చేశారు .ఆ ప్రకటనలో దీపావళి శుభాకాంక్షలు అని కాకుండా దీపావళి శుభకామనలు అని అంటూ హెడ్డింగ్ పెట్టి మరి ప్రకటనను విడుదల చేశారు .అంతే కాకుండా అధ్యక్షులు స్థానంలో అద్యక్షులు అని బ్లండర్ మిస్టేక్స్ ఉన్న ప్రకటనను మీడియాకు విడుదల చేశారు .
అయితే ఈ మీడియా ప్రకటన మీద సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తోన్నారు .ఈ సందర్భంగా నెటిజన్లు “నాయనా… పావలా కళ్యాణం…బిర బిరా సంతకం బరికే
ముందు ఒకసారి సదవవా?…అద్యకులు (అధ్యక్షులు)..ఏంటిరా అయ్యా…ఇంటెర్ చదివిన నీకు ఈ మాత్రం చదవడం రాదా?…మారండిరా…మార్చండిరా..అంటూ సెటైర్లు వేస్తోన్నారు .లోకేష్ ఏమో జయంతి రోజు వర్ధంతి అని శుభాకాంక్షలు చెప్తారు.నువ్వేమో దీపావళి నాడు శుభాకాంక్షలు చెప్పబోయి శుభకామనలు అని చెప్తారు అని సెటైర్లు వేస్తోన్నారు .