Home / MOVIES / మెర్స్‌ల్ వివాదం.. క‌ల‌క‌లం రేపుతున్న ర‌జ‌నీ కాంత్ ట్వీట్‌..!

మెర్స్‌ల్ వివాదం.. క‌ల‌క‌లం రేపుతున్న ర‌జ‌నీ కాంత్ ట్వీట్‌..!

తమిళనాడులో మెర్సల్‌ సినిమా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ఒక‌వైపు.. వైద్య రంగంలో జ‌రుగుతున్న‌అక్రమాల గురించి కడిగి పారేయ‌గా.. మ‌రోవైపు జీఎస్‌టీ దేశం మీద దండెత్తడం పైనా దుమ్మెత్తి పోసేశారు. అందుకేనేమో బీజేపీ బ్యాచ్‌కి ఒళ్ళు కాలిపోయి.. సినిమాని బ్యాన్‌ చేసెయ్యాలంటూ కమలనాథులు ఫత్వా జారీ చేసేయడం, నిర్మాత దిగొచ్చి ఆ సన్నివేశాల్ని, డైలాగుల్ని తీసేస్తాం.. అని ప్రకటించడం జరిగిపోయాయి.

ఇక మెర్సల్ చిత్రంపై కోలీవుడ్ ప్ర‌ముఖులు నుండి స‌పోర్ట్ కూడా ల‌భిస్తోంది. కమల్‌హాసన్‌, మెర్సల్‌ సినిమాకి మ‌ద్ధ‌తుగా నిలిచారు. ఒక‌సారి సెన్సార్ స‌ర్టిఫికేట్ ఇచ్చిన‌ సినిమాకి ఇంకో సెన్సార్‌ అవసరం లేదంటూ బీజేపీ నేతల రాద్ధాంతంపై సెటైర్‌ వేసిన విషయం విదితమే. ఇప్పుడు తాజాగా ర‌జ‌నీ కాంత్ కూడా మెర్స‌ల్ చిత్రం పై స్పందించారు. ఇంపార్టెంట్‌ టాపిక్‌ని అడ్రస్‌ చేశారనీ సోషల్‌ మీడియాలో రజనీకాంత్‌ స్పందించాడు. చాలా ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు… వెల్ డన్ అంటూ మెర్సల్ బృందానికి నా అభినందనలు అని రజినీకాంత్ ట్వీట్ చేశారు. ఆ ముఖ్యమైన విషయమేమిటో రజినీ స్పష్టం చేయకపోయినప్పటికీ.. కచ్చితంగా జీఎస్టీ గురించే అని అర్థమైపోతుంది. ఇక ఇప్ప‌టికే జీఎస్టీని విమర్శించే విధంగా ఉన్న పలు అభ్యంతరకర సన్నివేశాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్న బీజేపీకి సూపర్‌స్టార్ గట్టి దెబ్బ కొట్టారని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat