మూడో ప్రపంచ యుద్దం ముంచుకొస్తుందనే అనుమానాలు రోజు.. రోజుకు పెరుగుతున్నాయి. ఇందుకు నిదర్శనం.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎవరు తగ్గకపోవడమే. ఒకర్ని మరొకరు కవ్విస్తూ చేపడుతున్న చర్యలు ప్రపంచానికి ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పుడు అమెరికా యుద్ధ సన్నాహాల్లో తలమునకలైంది. ఇప్పటికే దక్షిణ కొరియా తీరాలకు అమెరికా అణ్వాయుధాలు చేరుకున్నాయి. దీంతో భాగంగా అమెరికాకు చెందిన అణుజలాంతర్గామి యూఎస్ఎస్ మిర్చిగన్ వారం కిందటే దక్షిణ కొరియాలోని బూసాన్ పోర్టుకు చేరుకుంది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా నావికా దళం అధికారిక ఫేజ్ బుక్ పేజీలో పేర్కొంది. రష్యా అధికారిక పత్రిక సూత్నిక్ కూడా దీనిని ధృవీకరించింది. ఉత్తర కొరియాపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా ఈ చర్యలను చేపట్టింది.
Related Articles
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
November 19, 2023