తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది .ఈ క్రమంలో ఇటీవల రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో జరిగిన సమావేశంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ,సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు సంధించిన ప్రశ్నలకు సమాధానం దాటవేస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వివరిస్తాను అని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పిన సంగతి విదితమే .
తాజాగా రేవంత్ రెడ్డి ను టీడీఎల్పీ పదవి నుండి తొలగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి .ఈ క్రమంలో తెలంగాణ టీడీపీ నేతలు సమావేశం అయి దీనికి ఆమోదం తెల్పి అధ్యక్షుడు ఎల్ రమణ లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఫ్యాక్స్ పంపినట్లు వార్తలు వస్తున్నాయి .అంతే కాకుండా ఇక నుండి రేవంత్ రెడ్డి టీడీఎల్పీ కార్యక్రమాలను ,టీడీపీ పార్టీకి చెందిన ఎటువంటి కార్యక్రమాలను నిర్వహించావద్దు అని రేవంత్ రెడ్డికి హుకం జారిచేసినట్లు కూడా వార్తలు వస్తోన్నాయి .