మైక్రోసాఫ్ట్ సీఈవో, భారతీయడు సత్య నాదెళ్ల వచ్చేవారం మరోసారి ఇండియాను సందర్శించనున్నారు. తన పుస్తకం హిట్ రిఫ్రెష్ ప్రమోషన్లో భాగంగా ఆయన రెండు రోజులపాటు భారత్లో పర్యటిస్తున్నారు. నవంబర్ 6-7 తేదీల్లో న్యూఢిల్లీ, హైదరాబాద్లో సత్య నాదెళ్ల సందర్శిస్తారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు, పారిశ్రామిక నాయకులు, విద్యార్ధులు, ఇతర షేర్ హోల్డర్స్ సహా ప్రముఖ విద్యావేత్తలతో ఆయన భేటీ కానున్నారని మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.ఈ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన తన పుస్తకంపై నిర్వహించే ఒక కార్యక్రమంలో వివిధ రంగాలవారితో ముచ్చటిస్తారు. ముఖ్యంగా ఇండస్ట్రీ ప్రముఖులు, కేంద్రప్రభుత్వ అధికారులతో పాటు విద్యార్థులు స్టార్ట్ అప్ కంపెనీలు, ఇతర ప్రముఖులను కలుస్తారు.