టీమిండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో భారత్ తరపున టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన వీరుడిగా రికార్డులకెక్కాడు.నిన్న బుధవారం దేశ రాజధాని నగరం ఢిల్లీ ఫిరోజా కోట్ల మైదానంలో బుధవారం న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20లో నాలుగు సిక్సర్లేసిన రోహిత్ మొత్తం 268 సిక్స్లు బాది అగ్రస్థానానికి చేరుకున్నాడు.
నిన్నటి వరకు 265 సిక్స్లతో అగ్రస్థానంలో ఉన్న రైనా.. రోహిత్ దెబ్బకు రెండో స్థానానికి పరిమితమయ్యాడు. 244 సిక్సర్లతో యువరాజ్ సింగ్, 226 సిక్స్లతో ఎంఎస్ ధోనీ, 221 సిక్సర్లతో యూసుఫ్ పఠాన్, 217 సిక్సర్లతో విరాట్ కోహ్లీ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.నిన్నటి మ్యాచ్లో రోహిత్ శర్మ మొత్తం 55 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 80 పరుగులు చేశాడు.