తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో సిపక్ తక్రా 4వ ప్రపంచకప్ పోటీలను మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. బ్రెజిల్, చైనా, వియత్నాం, పాకిస్థాన్, మయన్మార్, బంగ్లాదేశ్, సింగపూర్ తదితర దేశాల నుంచి 20 మంది సిపక్ తక్రా క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ .. విశ్వనగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతున్న తరుణంలో పోటీలు జరగడం రాష్ర్టానికి గర్వకారణమన్నారు. భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం క్రీడా వికాసానికి తోడ్పడుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నారని వెల్లడించారు. విజయం మరో విజయానికి నాంది కావాలి… ఓటమి విజయాల కోసం బాటలు వేయాలని మంత్రి ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.