తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో తెలుగు ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న.. సినీ నటుడు.. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చెన్నై లో నివాసం ఉన్న ఇల్లు అమ్మాకానికి పెట్టినట్లు సమాచారం. చెన్నై మహానగరం లో ఎన్టీఆర్ కు ఓ సొంత ఇల్లు ఉంది, అయితే హీరోగా వెలుగు వెలిగిన రోజుల్లో ఆ ఇంట్లోనే ఉండేవాడు కానీ తెలుగుదేశం పార్టీ స్థాపించే ముందు హైదరాబాద్ కు ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఆ ఇంటికి కల పోయింది .
అయితే ఆ ఇంటిని మాత్రం ఎన్టీఆర్ అమ్మలేదు.. అమ్మకుండా తన వారసులకు ఇచ్చాడు. కానీ ఇన్నాళ్ల తర్వాత ఆ పాత ఇంటిని అమ్మకానికి పెట్టారు ఎన్టీఆర్ వారసులు. టీనగర్లో ఉన్న ఆ ఇల్లు 30 కోట్ల విలువ ఉంటుందట అయితే ఎన్టీఆర్ గుర్తుగా ఉన్న ఆ ఇంటిని అమ్మకానికి పెట్టడం అంటే ఎన్టీఆర్ అభిమానులకు చేదు వార్తే గా మరి . ఆ ఇంటిని అమ్మకానికి పెడతారా.. లేక ఎన్టీఆర్ మ్యూజియంగా మార్చుతారో చూడాలి.