తెలుగు వెండితెర ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మీనందం పేరు తెలియని వాళ్లు ఉండరు. ఒకప్పటి హాస్య నటులు రేలంగి, రమణారెడ్డి, పద్భానాభం, లాంటి హాస్యనటుల తరువాత అంత పేరు తెచ్చుకున్నది ఒక్క బ్రహ్మనందం మాత్రమే. కొన్ని దశాబ్దాలుగా కామిడీ కింగ్గా ఆయన అలరిస్తున్నారు.చాలా సినిమాల విజయాలలో కీలక పాత్ర పోశించారు ఆయన.. బ్రహ్మనందం ఉంటేనే ఆ సినిమా హిట్ అనే స్థాయికి వెళ్ళుపోయింది ఆయన నటన.
అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి.. రోజులు మారాయి.. కామెడీ మారింది.. కమెడియన్లు మారారు. కొత్తతరం కమెడియన్లు వచ్చి ఒక్కొక్కరు ఒక్కో శైలిలో దూసుకుపోతున్నారు. మరోవైపు బ్రహ్మానందంను ఇప్పటి తరం దర్శకులు పట్టించుకోవడంలేదు. దీంతో ఈ హాస్య బ్రహ్మ సినిమాలకు గుడ్బై చెప్పనున్నారనే వార్త సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
ఈ వార్త వింటే కొంచెం ఆశ్యర్యం వేసినా.. మీరు విన్నది నిజమే అనేలా ఉన్నాయి జరుగుతున్న పరిస్థితులు. అందుకే గత 2 ఏళ్ళుగా చాలా సెలెక్టీవ్గా సినిమాలు చేస్తున్నారు.. మన బ్రహ్మీ. ముఖ్యంగా పెద్ద హీరో ల సినిమాలు, లేదా ఆయన లీడ్ రోల్లో ఉండే పాత్రలే చేస్తున్నారు. ఇక ఈ ఏడాది అయితే చాలా తక్కువ సినిమాలో కనిపించారు. ఇప్పుడు ఆయన అమెరికా యాత్ర అనే ఒక్క సినిమాలోనే నటిస్తున్నారట.
విష్ణు- నాగేశ్వర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం తర్వాత ఆయన మారే సినిమాకి సంతకం చేయలేదట. ఆ సినిమాలో ఆయన పాత్ర చాలా బాగా వచ్చిందట. అందుకే ఆ సినిమాతోనే తన కెరీర్కి వీడ్కోలు చెప్పాలనుకుంటున్నారట. ఈ విషయం గురించి తన సన్నిహితుల దగ్గర కూడా ఇప్పటికే చర్చించారట. సో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియదు కానీ.. తెలుగు సినీ ప్రముఖులకు మాత్రం చేదు వార్తే అని సర్వత్రా చర్చించుకుంటున్నారు.