సినీ పరిశ్రమలో పేమలు, సహజీవనాలు, పెళ్లిళ్ళు, విడిపోవడాలు చాలా కామన్.. అలాగే ఈ గ్లామర్ ప్రపంచంలో బ్రేకప్లు కూడా చాలా కామన్ అయిపోయాయి. అప్పటికే అనేక సినీ జంటలు పై నాలుగు సిచ్యువేషన్లలోని ఏదో ఒక సిచ్యువేషన్లో విడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఓ బాలీవుడ్ ప్రేమ జంట బ్రేకప్ లిస్ట్లో చేరిపోయారనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
బాలీవుడ్ స్టార్స్ అయిన దీపిక పడుకునే రణ్వీర్ సింగ్లు దాదాపు నాలుగేళ్ళగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇక వీరిద్దరు కలిసి నటించే చిత్రాల్లో అయితే మొగుడు.. పెళ్ళాం కంటే ఏమాత్రం తక్కువ కాదనే విధంగా రొమాంటిక్ సన్నివేశాల్లో జీవించి నటిస్తారు. ఇక త్వరలోనే వీళ్ళిదరు పెళ్లి చేసుకోవడం ఖాయం అని అనుకుంటుండగా.. వీరి బ్రేక్అప్ వార్త బీటౌన్లో సంచలనం రేపుతోంది.
సంజయ్ లీలా బన్సాలి తాజా చిత్రం పద్మావతిలో దీపిక రణ్వీర్లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదల అయినే ఈ చిత్ర టైలర్ ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా త్రీడీ ట్రయిలర్ లాంచ్ అయింది. ఈ ఈవెంట్ కు దీపిక మాత్రమే హాజరైంది. రణ్వీర్ సింగ్, మరో నటుడు షాహిద్ కూడా రాలేదు. రణ్వీర్ సింగ్ వస్తే తను రానని యూనిట్కు చెప్పేసిందట దీపిక.
దీంతో ఆ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ అందుకే యూనిట్ సభ్యులు ఈ ట్రయిలర్ లాంచ్ కు హీరోహీరోయిన్లు ఎవర్నీ ఆహ్వానించలేదట. అయితే రణ్వీర్ సింగ్ రాలేదని తెలుసుకున్న దీపిక ఆఖరి నిమిషంలో ఈవెంట్ కు హాజరైంది. అదే టైమ్ లో రణ్వీర్ సింగ్ స్నేహితులతో ఫుట్ బాల్ ఆడుకుంటున్నాడట. పిలిస్తే తప్పకుండా వస్తాడు. కానీ దీపిక కావాలనే రణ్వీర్ ను సైడ్ చేయించినట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి.