ఎన్టీఆర్ భవన్ అటు ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం కదా ..ఎన్టీఆర్ భవన్ ను ప్రభుత్వ ఆస్పత్రిగా మార్చడం ఏమిటి అని ఆలోచిస్తున్నారా ..?.నిన్న మీడియాతో మాట్లాడిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ “వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి శాసనసభపై పార్టీ జెండా ఎగురవేస్తామని ..ప్రస్తుత ముఖ్యమంత్రి అధికారక నివాసమైన ప్రగతి భవన్ ను ప్రభుత్వ ఆస్పత్రిగా మారుస్తాము అని తెలిపారు .
సామాజిక న్యాయం ఎజెండాతో పేదలకు టీడీపీ అండ నినాదంతో ముందుకు వెళ్తాం అని అన్నారు .టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రగతి భవన్ పై చేసిన వ్యాఖ్యలపై అధికార టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కౌంటర్లు వేశారు .మీడియాతో మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై గెలిచిన పది హేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు తమ సర్కారు గత మూడున్నర ఏండ్లుగా చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీ మారారు .
అంతే కాకుండా టీడీఎల్పీను టీఆర్ఎస్ లో వీలినం చేశారు .మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలలో ఒకరు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు .మిగిలిన ఇద్దరిలో ఆర్ కృష్ణయ్య టీడీపీ పార్టీకి దూరంగా ఉంటున్నారు .ఉన్న ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా వచ్చే ఎన్నికల్లో గెలవరు .ఇక ఎన్టీఆర్ భవన్ ఖాళీగా ఉండే బదులు దాన్ని ప్రభుత్వ ఆస్పత్రిగా నిర్వహించేందుకు తమ సర్కారుకు అప్పగించడానికి ముందుకురావాలని ఎల్ రమణకు సూచించారు .