Home / ANDHRAPRADESH / 20కోట్లకు లొంగని ఎమ్మెల్యే అన్ని కోట్లకు లొంగిపోయారా ..?

20కోట్లకు లొంగని ఎమ్మెల్యే అన్ని కోట్లకు లొంగిపోయారా ..?

ఏపీ టీడీపీ పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు నేడు కళ తప్పి మాట్లాడుతున్నారా ..?.ఒక అధికార పార్టీ అధ్యక్షుడిగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారా ..?అంటే అవును అనే అంటున్నారు రాజకీయ వర్గాలు .అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో రంపచౌడవరం అసెంబ్లీ నియోజక వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే రాజేశ్వరి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్న సంగతి విదితమే .

ఈ విషయం గురించి టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన కళా వెంకట్రావు మాట్లాడుతూ గత మూడున్నర ఏండ్లుగా తమ ప్రభుత్వం చేస్తోన్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వైసీపీ పార్టీ నుండి ఎమ్మెల్యేలు ,ఎంపీలు ,నేతలు తమ పార్టీలో చేరుతున్నారు అని అన్నారు .అంతే కాకుండా ఆయన ఇంకా మాట్లాడుతూ త్వరలోనే ఇంకా వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరతారు అని ..అందులో కర్నూలు జిల్లా నుండి ఒకరు ,తూర్పు గోదావరి జిల్లా నుండి ఒకరు ,నెల్లూరు జిల్లా నుండి ఒకరు వస్తారని చెప్పారు .

అయితే టీడీపీ పార్టీలో చేరితే తనకు 20 కోట్ల రూపాయలు ఇస్తామని టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకు ఆఫర్ చేశారు అని ఇదే ఎమ్మెల్యే రాజేశ్వరి సాక్షాత్తు అసెంబ్లీ లో ప్రకటించిన సంగతి విదితమే .అయితే తాజాగా బాబు సర్కారు చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీ మారుతున్నాను అని ఆమె చెప్పడం వెనక బాబు సదరు ఎమ్మెల్యేలకు వందల కోట్లు ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారు .దమ్ముంటే వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేర్చుకున్న ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలను ,ముగ్గురు ఎంపీలను పదవులకు రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో గెలుపించుకోవాలని వైసీపీ శ్రేణులు టీడీపీపై ఫైర్ అవుతున్నారు .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat