తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై అగ్గిలం మీద గుగ్గిలం అవుతూ నిత్యం విమర్శల పర్వం కురిపిస్తారు .ఒకానొక సమయంలో రేవంత్ రెడ్డి మీతిమీరి కూడా కేసీఆర్ పై విరుచుకుపడతారు .
అట్లాంటి రేవంత్ రెడ్డి చల్లగా బ్రతకాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దీవించారు అని వార్తలు వస్తున్నాయి .అసలు విషయానికి వస్తే రేవంత్ రెడ్డి మొన్న బుధవారం పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు పుష్పగుచ్చం ,రెండు వాక్యాల అభినందన లేఖ పంపారు అని వార్తలు వస్తున్నాయి .
ఆ లేఖలో దేవుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి .మీరు ప్రజాసేవలో మరెన్నో ఏళ్ళపాటు కొనసాగాలి .మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూడాలని అని ఉంది అంట .అయితే ఈ వార్తలు బాబు ఆస్థాన మీడియాకు చెందిన పత్రికగా పేరుమోసిన ప్రముఖ పత్రికలో రావడం గమనార్హం ..