Home / ANDHRAPRADESH / 2019లో పవన్ కు ఓట్లేస్తే ఏపీ సర్వ నాశనం -టాలీవుడ్ ప్రముఖ నటుడు..

2019లో పవన్ కు ఓట్లేస్తే ఏపీ సర్వ నాశనం -టాలీవుడ్ ప్రముఖ నటుడు..

ఏపీ ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడమే అని అందరికి తెల్సిందే .గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ,అధికార పార్టీ అయిన టీడీపీకి మధ్య ఓట్ల తేడా శాతం కేవలం ఐదు లక్షలు మాత్రమే కావడం విశేషం .

అయితే తాజాగా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ అగ్ర నటుడు ,విలక్షణ నటుడు అయిన ప్రకాష్ రాజ్ ఇటీవల బెంగుళూరు లో జరిగిన ఒక ప్రముఖ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో మాట్లాడుతూ సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే దేశం సర్వనాశనం ..వాళ్ళను చూసి ఓట్లు వేయద్దు ..వారి సామర్ధ్యాలను బట్టి ఆదరించాలి .వారికి దేశాన్ని పాలించే అర్హతలు ఉన్నాయా ..?.సినిమా వాళ్ళు కేవలం అభిమానానికి మాత్రమే పనికి వస్తారు …రాజకీయాలకు పని రారని అన్నట్లు వార్తలు సోషల్ మీడియాలో కోడై కూశాయి .

అయితే ఈ వ్యాఖ్యలపై పలువురు సెటైరికల్ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు .ప్రకాష్ రాజ్ కేవలం ఏపీలో పవన్ ను ,తమిళనాడు రాష్ట్రంలో కమల్ హసన్ ,రజనీకాంత్ ను దృష్టిలో పెట్టుకొనే ఈ వ్యాఖ్యలు చేశారు .వారు రాజకీయాలకు పనికి రారని .వాళ్ళను నమ్మి ఓట్లేస్తే ఇటు ఏపీ అటు తమిళనాడు రాష్ట్రాలు సర్వనాశనం అని అన్నట్లు ఆయన భావన అని..పవన్ తో ఉన్న విభేధాల కారణంగా ..ఆయన్ని గురించి వ్యక్తిగతంగా చాలా దగ్గర ఉండి తెల్సి నవాడు కాబట్టి ఏపీలోని పవన్ ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని ఇటు నెటిజన్లు అటు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat