తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గత మూడున్నర ఏండ్లుగా పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ పేద బలహీన వర్గాల పాలిట దేవుడుగా నిలుస్తున్నారు .ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మా నియోజక వర్గానికి దేవుడు అంటున్నారు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి .
ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మా మునుగోడు నియోజక వర్గానికి ఏమి కావాలో ..ఏమి చేయాలో ఇక్కడ ఉన్నవాళ్ళ కంటే ఎక్కువ తెలుసు .నాడు ఉద్యమ కాలంలోనే ఇక్కడ పాదయాత్రతో పాటు మర్రిగూడెం లోనే నిద్ర లేచారు .ప్లోరోసిస్ బాధితుల దీనస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు .
ప్రత్యేక రాష్ట్రం సాధించుకొని ఈ ప్రాంతం యొక్క సమస్యలను తీర్చి నియోజక వర్గ రూపురేఖలను మార్చాలని ఆనాడు చెప్పిన మాట నేడు నెరవేరుస్తున్నారు .ఈ ప్రాంతం కష్టాలను చూసిన ఆలోచనల నుండే పుట్టిన మిషన్ భగీరథను ఈ నియోజక వర్గంలో మొదలుపెట్టిర్రు .దీని ద్వారా నీళ్ళను ఇవ్వడమే కాకుండా ప్లోరిన్ సమస్యకు శాశ్వత పరిష్కారానికి డిండి ప్రాజెక్టుకు రూపకల్పన చేసి సాగునీటి కోసం ప్రణాళికలు రచించే ముఖ్యమంత్రే స్వయంగా పనులను ప్రారంభించారు .అందరి సహకారంతో ప్రతిపనిని గడువు కంటే ముందే పూర్తిచేస్తాం అని ఆయన అన్నారు .