తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్న సంగతి విదితమే .టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి గురించి తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు ,మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు స్పందించారు .
ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పలువురు తమ పార్టీలోకి వస్తారు అని ఆయన అన్నారు .రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయమని అన్నారు .రానున్న ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలో అటు దేశంలో తమ పార్టీకి అధికారంలోకి వస్తుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు .
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదని ఆయన అన్నారు .కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డిను ఆ పార్టీ నేతలు ఫుట్ బాల్ ఆడుకుంటారు .ఆయన పార్టీ మారి అతిపెద్ద తప్పు చేశారు అని ఆయన సంచలన వ్యాఖ్యలు ..