Home / ANDHRAPRADESH / ఏపీ ఫైర్ బ్రాండ్ రోజా స్కెచ్ -వైసీపీలోకి బాబు ముఖ్య అనుచరుడు ..

ఏపీ ఫైర్ బ్రాండ్ రోజా స్కెచ్ -వైసీపీలోకి బాబు ముఖ్య అనుచరుడు ..

ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత ప్రియమైన శిష్యుడు ,టీడీపీ పార్టీకి ఎప్పటి నుండో సేవలందిస్తున్న ఆయన సొంత జిల్లాకు చెందిన ఎంపీ త్వరలోనే టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని వార్తలు వస్తున్నాయి .ఈ నేపథ్యంలో ఏపీ ఫైర్ బ్రాండ్ ,వైసీపీ మహిళ విభాగ అధ్యక్షురాలు ,ఎమ్మెల్యే ఆర్కే రోజా వేసిన స్కెచ్ ఫలించింది అని రాజకీయ వర్గాలు అంటున్నాయి .

అందులో భాగంగా తనను మూవీలలో ఇంట్రడక్షన్ చేసి..ఆ తర్వాత తను రాజకీయాలవైపు రావడానికి ప్రధాన కారణమైన చిత్తూరు టీడీపీ పార్టీ ఎంపీ ఎన్ శివప్రసాద్ త్వరలోనే టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ గూటికి చేరనున్నారు అని సమాచారం .గత మూడున్నర ఏండ్లుగా బాబు దళితులకు చేస్తున్న అన్యాయాలతో పాటుగా ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో కూడా దళితులకు అవకాశం ఇవ్వకపోగా ..ఉన్నవారిని తప్పించడం ..ఎస్సీ వర్గీకరణ విషయం మీద దళితులతో రాజకీయాలు చేయడం నచ్చని ఆయన పార్టీ మారడానికి ప్రధాన కారణాలు అని రాజకీయ వర్గాల విశ్వసనీయ సమాచారం .

అయితే తను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ప్రస్తుత ఎంపీ శివప్రసాద్ అప్పట్లో టాప్ హీరోయిన్ గా ఉన్న రోజాను ప్రచారానికి వస్తే తనకు మంత్రి పదవి వస్తుంది అని చెప్పడం .ఆమె అప్పుడు తన తండ్రి శివప్రసాద్ మిత్రులవ్వడం ..కాదనలేక ప్రచారానికి రావడం ..శివప్రసాదరావు బంపర్ మెజారిటీతో గెలవడమే కాకుండా ఏకంగా బాబు హాయంలో మంత్రిగా భాద్యతలు స్వీకరించడం అన్ని జరిగిపోయాయి .దీంతో రోజా ఎంట్రీతో తాజాగా ఆయన తన రాజకీయ భవిష్యత్తుకోసం పార్టీ మారడం ఖాయం అంటున్నారు .అందుకే గత కొద్ది రోజులుగా ఇటు పార్టీ కార్యక్రమాలకు,ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండటం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తుంది .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat