తెలంగాణ రాష్ట్రంలో ఉప్పల్ నియోజకవర్గం లోని మల్లాపూర్ డివిజన్లో మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ ఇంచార్జి మైనంపల్లి హన్మంతరావు మరియు ఉప్పల్, ఎల్.బి నగర్, అంబేర్పెట్, మల్కాజిగిరి నియోజక వర్గాల ఇంచార్జి, ఎం.బి.సి. కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి గారు తెరాస కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్నీ నిర్వహించారు.
ఈ సందర్భంగా తాడూరి మాట్లాడుతూ కార్యకర్తలు అందరూ సమన్వయంతో పని చేసి పార్టీ ని క్షేత్ర స్థాయి నుండి పటిష్టం చేయాలి అని తెలిపారు, కొత్తగా పార్టీలో చేరే కార్యకర్తలుకు పూర్తి సహకారం అందిస్తామని.వచ్చే ఎన్నికలలో ఉప్పల్ నియోజక వర్గంలో తెరసా జెండా ఎగురవేయాలని స్పష్టం చేశారు, ఉద్యమకారులను కేసీఆర్ ఎన్నటికీ మారువబోరని, ఎవరు అధైర్య పడవద్దని తెలిపారు.
ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న ముఖ్యమంత్రి బంగారు తెలంగాణ కోసం ఎంతో కష్టపడు తున్నారని గుర్తుచేశారు, పార్టీ లో కష్టపడే ప్రతివారికీ గుర్తింపు లభిస్తుందన్నారు, ఓపికగా ఉండి రాబోయే రోజుల్లో ప్రతిఫలాలు అందిపుచుకోవడానికి సిద్ధంగా ఉండాలని అధైర్య పడవద్దని అన్నారు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లో ప్రతి ఒక్కరు పాటుపడాలని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయ కేతనం ఎగురవేయడానికి సిద్ధంగా ఉన్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో 4 వ డివిజన్ కార్పొరేటర్ గోళ్ళూరి అంజయ్య గారు, తెరసా నాయకులు రాపోలు సతీష్, దయాకర్, శైలేష్, తీగుళ్ల శ్రీను, విజయభాస్కర్, సైదులు తదితరులు పాల్గొన్నారు.