Home / ANDHRAPRADESH / రోజానా మ‌జాకా.. వైఎస్ఆర్‌ని భ‌లే ట‌చ్ చేసింది..!

రోజానా మ‌జాకా.. వైఎస్ఆర్‌ని భ‌లే ట‌చ్ చేసింది..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో భాగంగా సోమావారం నిర్వ‌హించిన.. వైసీపీ మ‌హిళా స‌ద‌స్సులో చంద్ర‌బాబు స‌ర్కార్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండి ప‌డ్డారు. పురుషులను చంపడమే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోందని రోజా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతి 50 వేల మందికీ ఓ వైన్స్ షాపును తెరిపించి, మగవాళ్ల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నాడని విమర్శించారు. జాతీయ రహదారులను లోకల్ రోడ్లుగా మార్చి ఇబ్బడి ముబ్బడిగా వైన్స్ షాపుల‌ను, బార్లను తెరిపించాడని చెప్పారు.

దీంతో ఎంతోమంది ఆడవాళ్ల జీవితాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నాడని, ఆయనకు బుద్ధి చెప్పాలని అన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయితేనే ఆడవాళ్ల కష్టాలు తీరుతాయని, జగనన్న మాటిస్తే, రాజన్న మాటిచ్చినట్టేనని, మద్యం నిషేధం జరిగాలంటే.. వైసీపీ అధికారంలోకి రావాల‌ని రోజా అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాలను తెచ్చింది వైయ‌స్ఆర్ అని గుర్తు చేశారు. దీంతో ఏపీ మ‌హిళ‌లు అంద‌రి గుండెల్లో ఉన్న రాజ‌న్న పై ఉన్న అభిమానాన్ని రోజా ట‌చ్ చేశారని వైసీపీ వ‌ర్గీయులు చ‌ర్చించుకుంటున్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat