మంత్రాలయం రాఘవేంద్రస్వామిని సూపర్స్టార్ రజనీకాంత్ దర్శించుకున్నారు. తుంగభద్ర నదిలో పుణ్యసన్నానం ఆచరించిన రజనీ గ్రామ దేవత మంచాలమ్మ, రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కు తీర్చుకన్నారు. ఆ తరువాత పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థుల వారి ఆశీర్వాదం తీసుకున్నారు. రజనీకాంత్ రాకతో మఠంలో సందడి నెలకొంది. సూపర్ స్టార్ను చూసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు.