ఏపీ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ల మధ్య ఉన్న తేడాను రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,దివంగత వైఎస్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా చెప్పేశారు .
కర్నూలు జిల్లాలో డోన్ నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ మాట్లాడుతూ వైఎస్ ఆనాడు నాపరాయి పరిశ్రమలను ఆదుకుంటే నేడు బాబు మాత్రం గాలికి వదిలేశాడు .నియోజక వర్గంలో బేతంచర్ల ,కొట్టాల ,పలుకూరు పాతపాడు గ్రామాల్లో నాపరాయి పరిశ్రమలు ఉన్నాయి .ఒక యూనిట్ ను స్థాపిస్తే దాదాపు ఇరవై మందికి ఉపాధి కలుగుతుంది .
నాపరాయి పాలిష్ యూనిట్లకు విద్యుత్ చార్జీ యూనిట్ కు రూ .4 .70 ఉండగా దివంగత ముఖ్యమంత్రి ,ప్రియతమ నేత వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రూ .3 .70 కి తగ్గించారు .కానీ గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు దాన్ని రూ .8.70కి పెంచేశారు .నష్టాలను భరించలేక పాలిష్ యూనిట్లు మూతపడుతున్నాయి .ఎస్సీలు బ్యాంకుల్లో నుంచి తీసుకున్న అప్పులను కట్టలేక
ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు .మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితిని మారుస్తాం ..నాపరాయి పరిశ్రమలకు విద్యుత్ చార్జిని తిరిగి 3 .70 కు తగ్గిస్తాం అని ఆయన అన్నారు ..