Home / ANDHRAPRADESH / తప్పులో కాలేసిన బాబు -నిన్న అవినీతి -నేడు పోలవరం

తప్పులో కాలేసిన బాబు -నిన్న అవినీతి -నేడు పోలవరం

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ అవినీతిలో కానీ అభివృద్ధిలో కానీ దేశంలోనే నెంబర్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని వార్తలోకి ఎక్కిన సంగతి విదితమే .తాజాగా ఆయన మరోసారి ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ తప్పులో కాలేశారు .

ఆయన మాట్లాడుతూ గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పించింది .కానీ ఆ తర్వాత ఏర్పడిన మోదీ సర్కారును ఈ ప్రాజెక్టును మీరు చూడాలని అడిగితె లేదు మీరే నిర్మించుకోవాలి అని అంటుంది అని అన్నారు .

అంతలోనే ఆయన మాట్లాడుతూ మన రాష్ట్ర అవసరాల రిత్య పోలవరం ప్రాజెక్టును తామే నిర్మించుకుంటాం అని కేంద్ర సర్కారుకు రిక్వెస్ట్ చేయగా రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది అని అన్నారు .ఒక్కసారి కేంద్రమే మీరు నిర్మించుకోవాలని చెప్పిన ఆయన మరోసారి మేము అడిగితేనే కేంద్రం నిర్మించుకోవాలని చెప్పింది అని చెప్పడం ఆయన తప్పులో కాలేశారు అని అసెంబ్లీ లాబీల్లో ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలే సెటైర్లు వేస్తున్నారు బాబుపై

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat