ఆయన నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల అరవై యేండ్ల కలను సాకారం చేసిన ఉద్యమ రథసారధి ..గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించి అప్పజెప్పిన అధికారాన్ని ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసం వినియోగిస్తూ దేశాన్నే తెలంగాణ వైపు చూసేలా కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రి .
అంతటి చరిత్ర ..ఇంతటి హోదా ఉన్న ఆయన తను ఢిల్లీకి రాజైన ..తల్లికి కొడుకే అనే సామెతను నిజం చేశారు ..ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అంటే తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ .నిత్యం పలు సమీక్షా సమావేశాలతో ..ప్రజాసంక్షేమ అభివృద్ధి పథకాల అమలు తీరుపై చర్చలు జరిపుతుంటారు ముఖ్యమంత్రి కేసీఆర్ .
అలాంటి సీఎం ఈ రోజు శనివారం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ముషీరాబాద్ లో గాంధీ నగర్ లో ఉంటున్న తన చిన్ననాటి మిత్రుడు కే రాజేంద్ర ప్రసాద్ ను కల్సి పరామర్శించారు . అయితే గత కొంతకాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్న సంగతి తెల్సుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను కల్సి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు .