ప్రపంచాన్ని శాసించే పెద్దన్నగా అందరు భావించే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవంకా ట్రంప్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఈ నెల 28నుండి దాదాపు మూడు రోజుల పాటు జరగనున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనున్న సంగతి విదితమే .ఆమె పర్యటన భాగంగా రాష్ట్ర రాజధాని నగరంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు .
అందులో భాగంగా రసాయనిక దాడులు జరిగినా కానీ వాటిని ఎదుర్కునేందుకు తక్షణ రక్షణ చర్యలు చేపట్టేందుకు వీలు కల్పించే వాహనాలుగా పేరుగాంచిన హాజ్మత్ వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు .హాజ్మత్ అంటే హాజర్దస్ మెటీరియల్ అని అర్ధం ..అత్యంత హనీకరమైన రసాయన దాడుల నేపథ్యంలో ఈ వాహనాలను వినియోగిస్తారు .
ఇలాంటి వాహనాలు మన దేశంలో చాలా అరుదుగా ఉంటాయి .ప్రధాని మోదీ ,ఇవంకా పర్యటనలో భాగంగా హాజ్మత్ వాహనాలను తెప్పించి మరి మోహరించాలని నిర్ణయించారు .అయితే ఇవంకా పర్యటనలో భాగంగా నగరంలో పలు ప్రాంతాలలో ప్రయాణించేందుకు అమెరికా నుండి ప్రత్యేకంగా మూడు వాహనాలను తెప్పించారు .మందు పాతరతో పాటు రాకెట్ లాంచర్లు ,జీవ రసాయన దాడుల నుండి రక్షణ కల్పించే విధంగా వీటిలో సదుపాయాలు ఉంటాయి ..