Home / MOVIES / మ‌రో ట్రెండ్ సెట్ చేశాడు!

మ‌రో ట్రెండ్ సెట్ చేశాడు!

ఎన్టీఆర్ ఏఎన్ఆర్, కృష్ణా, కృష్ణంరాజు, శోభ‌న్‌బాబు, ఇలా ఒక‌ప్ప‌టి అగ్ర‌హీరోలంద‌రూ ఏ భేషాజాలు లేకుండా మ‌ల్టీ స్టార‌ర్‌లు చేసిన వారే. ఒక‌రి మ‌ధ్య ఒక‌రికి ఎంత పోటీ ఉన్నా.. అభిమానుల మ‌ధ్య కూడా విభేదాలు ఉన్నా… అవేమీ ప‌ట్టించుకోకుండా మ‌ల్టీస్టార‌ర్‌లు చేసి అల‌రించారు అప్ప‌టి అగ్ర‌హీరోలు. కానీ, త‌రువాతి త‌రం హీరోలు మాత్రం వారిలో క‌లిసి న‌టించ‌లేదు. దీంతో మ‌ల్టీస్టార‌ర్‌ల‌కు తెర‌ప‌డిపోయింది. స్టార్ హీరోలు అంద‌రూ ఎవ‌రికి వారే అన్న రీతితో తయార‌య్యారు. కొన్ని ద‌శాబ్దాల‌పాటు తెలుగులో మ‌ల్టీస్టార‌ర్‌ల ఊసే లేదు. అయితే, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టులో మ‌హేష్‌బాబు, వెంక‌టేష్ క‌లిసి న‌టించ‌డంతో మ‌ళ్లీ మ‌ల్టీస్టార‌ర్‌ల‌కు మంచి ఊపు వ‌స్తుంద‌ని అనుకున్నారు. కానీ, ఆ త‌రువాత కూడా ఆశించిన మార్పు క‌నిపించ‌లేదు.

కానీ, ఇప్పుడు ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ఎన్టీఆర్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో సినిమా తీయ‌డానికి సిద్ధ‌ప‌డుతుండ‌టంతో టాలీవుడ్‌లో అనూహ్య‌మైన మార్పులు రావ‌డం ఖామ‌మ‌ని భావిస్తున్నారు. మ‌హేష్‌బాబు, వెంకీ క‌లిసి న‌టించిన‌ప్ప‌టికీ వారిద్ద‌రి కాంబో వేరే. ఎన్టీఆర్ చ‌ర‌ణ్ కాంబో వేరు. స‌మ‌కాలీనులు. ఒకే రేంజ్ స్టార్‌లైన ఇద్ద‌రు న‌టిస్తే దానికి వ‌చ్చే క్రేజే వేరు. ఈ సినిమా రిలీజ‌వ‌డానికి ముందే.. ఇలాంటి సెన్షేష‌న్ కాంబినేష‌న్‌లు. మ‌రికొన్ని తెర‌మీద‌కు రావ‌చ్చ‌ని భావిస్తున్నారు. అలాంటి కాంబోలు సాధ్యం కావ‌న్న ఉద్దేశంతో ర‌చ‌యిత‌లు, ద‌ర్శ‌కులు ఆ దిశ‌గా ఆలోచించ‌డం మానేశారు. కానీ, ఇప్పుడు ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌లు వేసే అడుగుతో అంద‌రి ఆలోచ‌న‌లు మారుతాయి. మ‌రిన్ని మ‌ల్టీస్టార‌ర్ స్టోరీస్ రెడీ అవుతాయి. రాజ‌మౌళి సినిమా అంచ‌నాల్ని అందుకుంటే భ‌విష్య‌త్తులో తెలుగులో సెన్షేష‌న‌ల్ మ‌ల్టీస్టార‌ర్లు మ‌రిన్ని చూడొచ్చేమో..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat