ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల కోసం సరికొత్త వరం ప్రకటించాడు .అందులో భాగంగా ఈ రోజు సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సంక్షేమంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ “వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రాష్ట్రంలో పెళ్లికానుక పథకం కింద పేదలకు ఆర్థికసాయం చేయనున్నట్టు ప్రకటించారు.
ఈ పథకంలో భాగంగా పెళ్లికి ముందు రూ.20 శాతం, పెళ్లి రోజుకు మిగతా 80శాతం ఆయా వర్గాలకు కేటాయించిన ప్రకారం మొత్తాన్ని అందజేస్తామని ఆయన స్పష్టంచేశారు. డ్వాక్రా సంఘాలు తన మానసిక పుత్రికలని, ఒక ముందుచూపుతో వాటిని పెట్టినట్టు చెప్పారు. సమాజంలో మహిళలకు పురుషులతో సమాన గౌరవం దక్కాలనే ఉద్దేశంతోనే వీటిని ఏర్పాటుచేసినట్టు ఆయన మరోసారి స్పష్టంచేశారు. ప్రతి కుటుంబానికి రూ.10వేల ఆదాయం వచ్చేలా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.