Home / MOVIES / చైతుని లైన్లో పెట్టిన అను.. పాపం స‌మంత‌..!

చైతుని లైన్లో పెట్టిన అను.. పాపం స‌మంత‌..!

నాని హీరోగా తెర‌కెక్కిన మ‌జ్ను చిత్రంలో హీరోయిన్‌గా తెలుగు ఇండ‌స్ర్టీకి ప‌రిచ‌య‌మైంది అను ఇమ్మాన్యుయేల్‌. ఆ చిత్రం విజ‌యం సాధించ‌డంతో ఈ భామ‌కు వ‌రుస అవ‌కాశాలు చుట్టుముట్టాయి. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించిన కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త చిత్రంలో న‌టించి మ‌రో హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్న ఈ భామ న‌టించిన మ‌రో చిత్రం ఆక్సిన్ త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. అయితే, తెలుగు ఇండ‌స్ర్టీకి ప‌రిచ‌య‌మైన అన‌తికాలంలోనే త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ హీరోగా తెర‌కెక్కుతున్న అజ్ఞాత‌వాసి చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక కావ‌డంతోపాటు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టించ‌నున్న మ‌రో చిత్రంలోనూ ఈ భామ హీరోయిన్‌గా అవ‌కాశం ద‌క్కించుకుంది.

తాజాగా స‌మాచారం ప్ర‌కారం .. అక్కినేని నాగచైత‌న్య హీరోగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి తెర‌కెక్కించ‌నున్న శైలాజారెడ్డి అల్లుడు చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టించ‌నుంది. అయితే, అజ్ఞాత‌వాసి చిత్రం షూటింగ్ స‌మ‌యంలో ఇను ఇమ్మాన్యుయేల్ టాలెంట్ చూసిన చిత్ర నిర్మాత రాధాకృష్ణ.. తనకే చెందిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బేనర్లో తెరకెక్కబోయే ‘శైలజారెడ్డి అల్లుడు’లో ఛాన్స్ ఇప్పించాడట.

ఈ విష‌యం కాస్తా సినీ జ‌నాల చెవిన ప‌డ‌టంతో అరెరే… రాజ్ త‌రుణ్‌, గ‌పీచంద్‌, ప‌వ‌న్ క‌ల్యాన్‌, అల్లు అర్జున్‌తోపాటు నాగ చైత‌న్య‌నూ ఇను ఇమ్మాన్యుయేల్ లైన్లో పెట్టేసిందే.. పాపం స‌మంత అంటూ ఫ‌న్నీ కామెంట్ చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat