Home / SLIDER / తెలంగాణలో స్టార్టప్ వాతావరణం అద్భుతం..కేసీఆర్

తెలంగాణలో స్టార్టప్ వాతావరణం అద్భుతం..కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైద‌రాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఈ రోజు మంగళవారం ప్రారంభ‌మైన జీఈఎస్‌లో రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రారంభోప‌న్యాసం ఇచ్చారు. భార‌త ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, అమెరికా అధ్య‌క్షుడి స‌ల‌హాదారు ఇవాంక ట్రంప్‌తో పాటు ఔత్సాహిక‌ పారిశ్రామిక వేత్త‌ల‌కు సాద‌రంగా స్వాగతం ప‌లుకుతున్న‌ట్లు చెప్పారు. త‌మ ప్ర‌భుత్వం టీఎస్-ఐపాస్ ద్వారా 15 రోజుల్లో ప‌రిశ్ర‌మ‌ల‌కు అనుమ‌తులు ఇస్తోంద‌ని ఆయన చెప్పారు. ప్ర‌పంచంలోని 5 గొప్ప సంస్థ‌లు హైద‌రాబాద్‌లో ఉన్నాయ‌ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌ వంటి సంస్థ‌లు ఉన్నాయ‌ని తెలిపారు.

ఇక్క‌డ పెట్టుబ‌డుల‌కు ఎన్నో అవకాశాలు ఉన్నాయ‌న్నారు. టీఎస్ ఐపాస్‌తో సుల‌భత‌ర విధానాన్ని అమ‌ల్లోకి తెచ్చామ‌న్నారు. ఇప్ప‌టికే 5469 ఇండ‌స్ట్రీయ‌ల్ యూనిట్స్‌కి అనుమ‌తులు ఇచ్చామ‌ని సీఎం పేర్కొన్నారు. ఈ స‌ద‌స్సులో ఔత్సాహిక పారిశ్రామిక వేత్త‌లు త‌మ‌ ఆలోచ‌న‌లు పంచుకుంటార‌ని ముఖ్యమంత్రి తెలిపారు.అంతకుమందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ మెట్రో రైలును ప్రారంభించి హెచ్ఐసీసీకి వచ్చిన ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ప్రధాని మోదీతో అరగంటకు పైగా చర్చలు కొనసాగించిన తర్వాత ఆమె మీటింగ్ హాల్ నుంచి బయటకు వచ్చారు.అనంతరం ఎస్కలేటర్ ద్వారా కిందకు వచ్చిన ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్ చూసి ఆమె నవ్వుతూ పలకరించారు. సీఎంకు షేక్ హ్యాండ్ ఇచ్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat