Home / ANDHRAPRADESH / పోలవరం కట్టడం అంటే గ్రాఫిక్స్ అనుకున్నారా -ఉమాపై గడ్కరీ ఫైర్ ..!

పోలవరం కట్టడం అంటే గ్రాఫిక్స్ అనుకున్నారా -ఉమాపై గడ్కరీ ఫైర్ ..!

ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్స్ ఒకటి జగన్ పాదయాత్ర .రెండు పోలవరం ప్రాజెక్టు .రాష్ట్ర ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సర్కారు నిబంధనలను తుంగలో తొక్కి దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయలకు సరికొత్తగా టెండర్లు పిలిచింది .దీంతో సీరియస్ అయిన కేంద్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కొత్తగా పిలిచిన టెండర్లను నిలిపివేయాలని బాబు సర్కారుకు లేఖ రాసింది .

దీంతో పోలవరం ప్రాజెక్టు వ్యవహారం దేశ రాజధాని ఢిల్లీకు చేరింది .ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ఏపీ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు .ఈ సందర్భంగా కేంద్రమంత్రి పోలవరం ప్రాజెక్టును నిబంధనల ప్రకారం కడితే తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది .

దీంతో 2018 లో ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుంది .కానీ మీరు మాత్రం నియమాలను ,నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టమొచ్చినట్లు టెండర్లను పిలిచి ప్రజాధనాన్ని ,కేంద్రం చేసే చేసే ఆర్థిక సహాయాన్ని మీ నేతలకు ,కాంట్రాక్టర్లకు అప్పనంగా ముట్టజేప్పితే మేము ఏమి చేస్తాము .ప్రాజెక్టు కట్టడం అంటే అమరావతి రాజధాని పేరిట మూవీ దర్శకుల చుట్టూ తిరుగుతూ ..దేశాల పర్యటనలు చేస్తూ ..గ్రాఫిక్స్ లలో మీడియాలో ప్రచారం చేసినంత ఈజీ నా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అని జాతీయ మీడియాలో ప్రత్యేక కథనాలు వెలువడుతున్నాయి ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat