తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మహానగర వాసుల చిరకాల కోరిక హైదరాబాద్ మెట్రో .ఇటివల సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ మహానగరానికి వచ్చి మెట్రోను ప్రారంభించి జాతికి అంకితం చేశారు .ఆ తర్వాత రోజు నుండి నేటి వరకు మెట్రో లో ప్రయాణించే వారి సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతుంది .
ఇలాంటి తరుణంలో మెట్రో సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది .అదే నగరంలో ఉబర్ క్యాబ్ సంస్థతో మహా ఒప్పందం చేసుకుంది .ఈ ఒప్పందంలో భాగంగా మెట్రోస్టే స్టేషన్ల దగ్గర నుండి ప్రయాణికుల గమ్యస్థానానికి చేరుకునే విధంగా రవాణా ఏర్పాట్లు చేస్తామని ఉబర్ క్యాబ్ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది . ఇలా చేయడం వలన మెట్రో స్టేషనల దగ్గర ట్రాపిక్ సమస్య ,పార్కింగ్ సమస్య ఉండదు .ప్రయాణికులు మెట్రో దిగ్గానే ఇంటికి చేరుకోవడానికి వీలుంటుందని తెలంగాణ ఏపీ ఉబర్ జనరల్ మేనేజర్ దీపక్ రెడ్డి తెలిపారు .