కోలీవుడ్ బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుని వెండితెరకు షిప్ట్ అయిన నటీమణుల్లో ఐశ్వర్యా రాజేష్ ఒకరు. అడ్డ కత్తి, కాకు ముట్టాయ్, రమ్మీ వంటి వరుస సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది ఈ భామ. చూడగానే ఆకర్షించే కళ్లు, చక్కటి అభినయం, పర్ఫెక్ట్ బాడీ షేప్ ఐశ్వర్యా రాజేష్ సొంతమని అంటుంటారు తమిళ తంబీలు. ఒకానొక సమయంలో సన్టీవీలో టెలికాస్ట్ అయిన ఓ ప్రోగ్రాం ద్వారా సినీ అభిమానుల్లో మాంచి క్రేజ్ సంపాదించి వెండితెరమీద అడుగుపెట్టిన ఈ యువ హీరోయిన్కు కూడా వేధింపులు తప్పలేదట.
ఈ విషయాన్ని తాజాగా ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది ఐశ్వర్యా రాజేష్. తాను వెండితెరకు పరిచయమైన రోజుల్లో బాలీవుడ్లో ఛాన్సుల కోసం ప్రయత్నించానని, ఆ ప్రయత్నంలో తనకు చేదు అనుభవాలు ఎదురయ్యాయంటూ చెప్పుకొచ్చింది. ఆ సమయం తనపై చేతులు వేస్తూ.. ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ.. పడుకోవడానికి ఎప్పుడొస్తావంటూ అడిగారని, ఇప్పటికీ వేరే నెంబర్ల నుంచి ఫోన్లు వస్తున్నాయని తన చేదు అనుభవాలను ఇంటర్వ్యూలో వెల్లడించింది ఐశ్వర్యా రాజేష్.