శ్రీలంకతో జరుగుతున్న వన్డే రెండో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు రోహిత్ శర్మ. విరాట్ గైర్హాజరుతో టీమిండియా కెప్టెన్ బాద్యతలు తీసుకున్న రోహిత్.. మొదటి వన్డే ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే రెండో వన్డేలో మాత్రం లంక బౌలర్లు కళ్లు బైర్లు కమ్మేలా.. వీర ఉతుకుడు ఉతికాడు. సిక్సర్లను ఇంత అలవోకగా కూడా కొట్టొచ్చా అనే రీతిలో రోహిత్ తన కెరీర్లో మూడవ డబుల్ సెంచరీ కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు.
ఇక మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 4 వికెట్ల నష్టానికి 392 పరుగులు చేసింది. 151 బంతులను ఎదుర్కొన్న రోహిత్ 12 సిక్సర్లు, 13 ఫోర్ల సాయంతో ద్విశతకం (201) సాధించాడు. ఈ క్రమంలో వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్ మెన్గా రోహిత్ అవతరించాడు. అయితే రోహిత్ డబుల్ సెంచురీకి దగ్గరవుతున్న సమయంలో ఒక ఆశక్తికర సంఘటన చోటు చేసుకుంది. రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేసిన క్షణంలో అతని భార్య రితిక తీవ్ర ఉద్వేగానికి లోనయి ఆనందభాష్పాలు రాల్చింది. దీంతో టీవీ చూస్తున్న ప్రేక్షకులు మొత్తం ఎంతో ఉద్వేగానికి లోనైంది.