తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఇటివల ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెల్సిందే నవంబర్ 28న ప్రారంభమైన ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా 170 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు .అందులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవంకా ట్రంప్ కూడా హాజరయ్యారు .
ఈ సదస్సు సందర్భంగా ఇవంకాకు పలక్ నుమా ప్యాలెస్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విందు కూడా ఇచ్చారు .రాష్ట్ర పర్యటనలో భాగంగా తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేసిన అతిధి మర్యాదల గురించి ఒక లేఖ రాశారు .ఈ లేఖలోపలక్ నుమా ప్యాలేస్ నుండి మీరు ఇచ్చిన బహుమతి నా గుండెను తాకింది .. తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు .. భవిష్యత్తులో నేను భారత పర్యటనకు వచ్చినప్పుడు మిమ్మల్ని మళ్ళీ తప్పకుండా కలుస్తాను అని ఆమె తెలిపారు ..